ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలి :కలెక్టర్​ సత్య శారదాదేవి

ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలి :కలెక్టర్​ సత్య శారదాదేవి

కాశీబుగ్గ, వెలుగు: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని వరంగల్ కలెక్టర్​ సత్య శారదాదేవి అన్నారు. బుధవారం సిటీలోని వరంగల్​ కేఎంసీ సూపర్​ స్పెషాల్టీ ఆస్పత్రిని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  డాక్టర్ల హాజరు రిజిస్టర్​ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్ నర్స్ నుంచి సంజాయిషీ కోరాలని ఆస్పత్రి పర్యవేక్షకులను ఆదేశించారు.

.అనంతరం రోగుల వద్ద  ఆస్పత్రి సేవలపై ఆరా తీశారు. కలెక్టర్  మాట్లాడుత కేఎంసీ సూపర్​ స్పెషాల్టీ ఆస్పత్రి శాశ్వత ప్రాతిపదికన అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన నివేదికను జూన్​ 6 నాటికి సమర్పించాలని చెప్పారు. ఈ నెల 10 నాటికి 5వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఆపరేషన్​ థియోటర్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్​ రామ్ కుమార్​రెడ్డి, ఎస్ఈ గోపాల్ రెడ్డి, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.