
కాశీబుగ్గ, వెలుగు: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి అన్నారు. బుధవారం సిటీలోని వరంగల్ కేఎంసీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ల హాజరు రిజిస్టర్ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్ నర్స్ నుంచి సంజాయిషీ కోరాలని ఆస్పత్రి పర్యవేక్షకులను ఆదేశించారు.
.అనంతరం రోగుల వద్ద ఆస్పత్రి సేవలపై ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుత కేఎంసీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి శాశ్వత ప్రాతిపదికన అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన నివేదికను జూన్ 6 నాటికి సమర్పించాలని చెప్పారు. ఈ నెల 10 నాటికి 5వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియోటర్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ రామ్ కుమార్రెడ్డి, ఎస్ఈ గోపాల్ రెడ్డి, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.